దాంతో వారు ఇండిపెండెంట్ గా ఉంటారు. టీడీపీకి అనుబంధంగా సాగుతూ సర్కార్ మీద రెట్టించిన స్పీడ్ తో విమర్శలు చేస్తారు. అది కొత్త తలనొప్పిగా మారుతుంది. అందుకే వారి మీద గట్టిగానే చర్యలు ఉందాలని ఈ దెబ్బకు సొంత పార్టీలో అసమ్మతికి బయట టీడీపీని నో సౌండ్ అన్నట్లుగా ఉండాలని వైసీపీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోందని టాక్.
అదేంటి అంటే స్పీకర్ తమ్మినేని సీతారాం కి ఈ నలుగురి ఎమ్మెల్యేల మీద ఫిర్యాదు చేయడం. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణరెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవిల మీద పార్టీ తీసుకున్న క్రమశిక్షణా చర్యలను ఉటంకిస్తూ వారు గీత దాటారు కాబట్టి సభ్యత్వాలు లేకుండా చేయాలని వైసీపీ తరఫున ఒక ఫిర్యాదు తొందరలో వెళ్లనుందిట.
సరే స్పీకర్ కి ఫిర్యాదు చేయడం దాకా ఓకే అనుకున్నా వారి గీత దాటారు అన్నది ఎలా నిరూపిస్తారు అన్నదే ఇపుడు బిగ్ క్వశ్చన్. నిజానికి ప్రజా ప్రాతినిధ్య చట్టం లో కొన్ని సెక్షన్లు చెప్పేది ఏంటి అంటే ఓటు అన్నది సీక్రెట్ అని. దాన్ని బహిరంగ పరచడం నేరం కూడా. అయినా ఇలాంటి ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు తమ సౌలభ్యం కోసం కోడ్ ని పెట్టుకుంటాయి. ఆ విధంగా అవి గుర్తిస్తాయి. వాటి వరకూ అది కరెక్ట్.
కానీ అవి పూర్తిగా అనధికార చర్యలు. ఇంకా చెప్పాలీ అంటే రాజ్యాంగబద్ధంగా అవి కుదరని చర్యలు. పార్టీ పరంగా చర్యలు తీసుకోవడానికి ఎపుడూ రైట్ ఉంటుంది. తప్పు చేశారు కాబట్టి వారు మాకు వద్దు అని పార్టీ అనేసుకోవడం వేరు. అదే రెండు లక్షల మంది ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను అనర్హత వేటు వేసి తప్పించడం వేరు. దానికి రాజ్యాంగ నిబంధనలు చాలా ఉంటాయి. న్యాయపరమైన విషయాలు బోలెడు ఉంటాయి.
జగన్ని ప్రతీ రోజూ విమర్సిస్తూ మూడున్నరేళ్ళ పాటు చెవిలో జోరీగగా ఉన్న న్ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు విషయంలో కూడా అనర్హత వేటు పడకపోవడానికి కారణం ఇదే. ఆయన తప్పు చేసినట్లుగా విప్ ని ధిక్కరించినట్లుగా నిరూపించాలి. అది జరగలేదు. మిగిలిన విమర్శలు అన్నీ చేసే హక్కు ఒక ఎంపీగా ఆయనకు ఉంది.
మరి నలుగురు ఎమ్మెల్యేలు విప్ ని ధిక్కరించారు అని వైసీపీ అంటోంది. లేదు అని వారు అంటున్నారు. దాన్ని స్పీకర్ ముందు రుజువు చేయాలి. అలా చేస్తేనే అనర్హత వేటు పడుతుంది. మరి వైసీపీ వద్ద ఉన్న అధారాలు ఏంటి అన్నదే చర్చ. ఒకవేళ అలాంటి ఆధారాలు రెడీ చేసుకుని వైసీపీ సిద్ధంగా ఉంటే మాత్రం నలుగురు మాజీ ఎమ్మెల్యేలు అయిపోతారు. ఆ మీదట ఉప ఎన్నికలు వస్తాయి. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు వచ్చే ఉప ఎన్నికల్లో జనాల మూడ్ కూడా వేరేగా ఉంటుంది.
అంత రిస్క్ చేసి ఉప ఎన్నికలు తెచ్చి టీడీపీని ఓడించి నాలుగు సీట్లను వైసీపీ గెలుచుకుంటే అది రికార్డే. కానీ అలా జరుగుతుందా అన్నదే చూడాలి. ఏది ఏమైనా టీడీపీకి నో సౌండ్ అనిపించాలని రెబెల్ ఎమ్మెల్యేల మీద రివెంజ్ తీర్చుకోవాలని వైసీపీ మాత్రం కసిగా ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.